చిత్తూరు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అదుపుతప్పిన ఓ కంటెయినర్ లారీ రెయిలింగ్ పైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బతికి బయటపడ్డారు. ఈ ప్రమాదం ఆదివారం బైరెడ్డిపల్లి మండలం కైగల్ వంతెనపై చోటు చేసుకుంది.
ఈ ఘటనతో పలమనేరు-కుప్పం రహదారిపై రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. సుమారు ఐదు గంటల పాటు ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని లారీని వంతెనపై నుంచి పక్కకు తీసి ట్రాఫిక్ను క్లియర్ చేశారు.