వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆంద్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్కు నూతన చైర్మన్గా ఎంపికయ్యారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడటంతో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్కు ఆదివారం నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసింది ప్రభుత్వం. మొత్తం 8 కమిటీలను అనుబంధ కమిటీలుగా ఏర్పాటు చేశారు. చైర్మన్గా విజయసాయి రెడ్డిని నియమించగా, అధ్యక్షుడుగా ధర్మాన కృష్ణప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా
పురుషోత్తం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో గుంటూరులో ఏపి ఒలింపిక్ భవన నిర్మాణం చేపడతామని అన్నారు. హైదరాబాద్లో ఉన్న ఒలింపిక్ భవనం కబ్జాలో ఉందని, దాని సమస్యను పరిష్కరిస్తానని వెల్లడించారు.