తొలిరోజే కిషన్ రెడ్డికి షాక్ ఇచ్చిన అమిత్ షా

SMTV Desk 2019-06-02 13:33:25  amit shah

కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే కిషన్ రెడ్డికి బీజేపీ అధినాయకత్వం నుంచి ఊహించని రీతిలో అక్షింతలు పడ్డాయి! హైదరాబాద్ టెర్రరిస్టుల అడ్డా అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేయగా, ఒవైసీ తీవ్రస్థాయిలో అభ్యంతరం చెప్పడాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇబ్బందికరంగా భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో కిషన్ రెడ్డిని ఆయన మందలించినట్టు తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ కిషన్ రెడ్డికి హితవు పలికినట్టు వినికిడి. కొన్ని సున్నితమైన అంశాల్లో ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉందంటూ పేర్కొన్నారట!