అమ్మాయిని పెళ్ళిచేసుకుని మోసం చేసిన టాలీవుడ్ రచయిత

SMTV Desk 2019-06-02 13:28:55  tollywood,

వివాహం చేసుకున్న కొన్ని గంటల్లోనే ఆమెను వదిలి వెళ్లిపోయాడు సినీ, సీరియల్ రచయితగా పనిచేస్తున్న గౌతమ్. గత కొన్నేళ్లుగా యువతిని ప్రేమించానంటూ ఆమెతో సజీవనం చేస్తూ అవసరమైనప్పుడు ఆమె నుండి లక్షల రూపాయల వసూలు చేసి ఆమె పెళ్లి మాట ఎత్తేసరికి ముఖం చాటేశాడు. దీంతో ఆమె ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించండంతో ఆమె తల్లదండ్రులు పోలీసులను ఆశ్రయించిగా జైలుకు వెళ్ళాల్సి వస్తుంది అనే భయంతో గుడిలో తాళికట్టిన రమణ తీరా కాపురం దగ్గరికి వచ్చేసరికి పెళ్లి జరిగిన మొదటి రాత్రే చెప్పాపెట్టకుండా పరారయ్యాడు. ఇదేమిటని బాధితురాలు నిలదీస్తే.. నువ్వు నాకొద్దు అంటూ పెళ్లి చేసుకున్న మరుసటి రోజే విడాకులు తీసుకుందామని చెప్పాడు. దీంతో షాక్‌కు గురైన బాధితురాలు న్యాయం చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశాఖ పట్నం కి చెందిన 28 ఏళ్ల యర్రంశెట్టి రమణ గౌతమ్ బుల్లితెరతో పాటు వెండితెరకు కథలు రాస్తూ ఫిలింనగర్‌లో గత ఆరేళ్లుగా అద్దెకు ఉంటున్నట్టు గుర్తించారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న రమణ కోసం పోలీసులు రంగంలోకి దిగారు.