నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులతో కలసి బాలకృష్ణ కూడా నమాజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసం రంజాన్ అని, ఈ మాసంలో కఠోర ఉపవాస దీక్షలతో భక్తిని చాటుకుంటున్నారని అన్నారు. ముస్లిం మతపెద్దలు దువా నిర్వహించి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ఇటీవల ముగిసిన ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో బాలకృష్ణ వరుసగా రెండవ సారి హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.