ముంబై, ఆగస్ట్ 28: ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ విశాల్ సిక్కా రాజీనామా అనంతరం భారీ పతనం చోటు చేసుకున్న స్టాక్ మార్కెట్లో నేటి నుండి వృద్ధి రేటు ప్రారంభమైంది. సిక్కా రాజీనామా ప్రభావం ప్రధానంగా అత్యధికంగా ఇన్ఫోసిస్ షేర్పై పడిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల నందన్ నీలేకని కంపెనీలోకి రాబోతున్నారని ప్రకటన వెలువడినప్పటి నుండి విలువ పెరుగుతూ వచ్చింది. అయితే తాజాగా నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా నీలేకని బాధ్యతలు చేపట్టినప్పటి నుండి షేర్ విలువలో భారీ పెరుగుదల నమోదైంది. దాదాపు 4.5 శాతం వృద్ధితో సోమవారం ఉదయానికి షేర్ విలువ రూ. 953.50కి చేరుకుంది. ఇదే వృద్ధి రేటు నిలకడగా సాగితే ఇన్ఫోసిస్ గత వైభవం అతి తొందరలోనే దరిచేరుతుందని ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు.