నంద్యాల, ఆగస్ట్ 28 : కాకినాడ ఎలక్షన్స్ లో కూడా విజయం సాధించేది తెలుగుదేశం పార్టీనే అంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. దీనికి నంద్యాల ఎన్నికల ఫలితాలే నిదర్శనమంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ఈ నంద్యాల ఉపఎన్నికలు ఘన విజయం సాధించిన సందర్భంగా, విజయనగరం జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్, ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు విని ప్రజలంతా భయపడిపోయారన్నారు. నంద్యాలలోనే 14 రోజుల పాటు మకాం వేసి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని హెద్దెవ చేసారు. ఎవరెన్ని చెప్పిన నంద్యాల ప్రజలు మాత్రం అభివృద్ధిని మాత్రమే కోరుకున్నారని, అయినా ఇప్పుడు జగన్ మానసిక పరిస్థితి ప్రజలకు పూర్తిగా అర్థమయిందని తెలిపారు.