వన్డే ప్రపంచకప్లో వెస్టిండీస్ శుభారంభం చేసింది. టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లోనే పాకిస్థాన్ పై 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో క్రిస్గేల్ 50, నికోలస్ పూరన్ 34నాటౌట్ రాణించడంతో కేవలం 13.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమీర్ ఒక్కడే ఆరు ఓవర్లు వేసి మూడు వికెట్లు తీశాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ 21.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది.ప్రత్యర్థుల షార్ట్ పిచ్ బంతులకు పాక్ ఆటగాళ్లు బెంబేలెత్తారు మూడంకెల స్కోరును దాటడానికి నరకయాతన పడింది.ఒక దశంలో కేవలం 9 పరుగుల వ్యవధిలో పాక్ 5 వికెట్లు పోగొట్టుకుంది. ఆఖరి దశలో వహబ్ రియాజ్ 2 సిక్సర్లు, బౌండరీ బాదడంతో పాక్ వంద మార్కు దాటింది. పాక్ ఆటతీరుపై నెటిజన్లు దారుణమైన సటైర్లు వేస్తున్నారు.