న్యూఢిల్లీ, ఆగస్టు 28 : వివాదాస్పదమైన బాబా ఆశారాం బాపు అత్యాచార కేసు విచారణలో గుజరాత్ ప్రభుత్వం జాప్యం చేస్తుందని సుప్రీం కోర్టు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు బాధితులను ఎందుకు విచారించలేదని ప్రశ్నించిన సర్వొంనత న్యాయస్థానం, దీనిపై గుజరాత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆదేశించింది. 2013లో ఆశారాం బాపు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని 16 ఏళ్ల బాలిక ఆరోపించింది. ఈ కేసులో అంత్యంత నాటకీయ పరిణామాల మధ్య జోధ్పూర్ పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. అనంతరం ఆయన కుమారుడు కూడా అత్యాచార కేసులో అరెస్టు అయ్యారు.