యూరేసియన్‌ అథ్లెటిక్స్‌లో చెలరేగిన భారత అథ్లెట్లు

SMTV Desk 2019-06-01 11:53:18  Eurasian Athletics Championships 2019

అండర్‌-20 యూరేసియన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు చెలరేగారు. గురువారం కజకిస్థాన్‌లోని అల్మాటీలో జరిగిన తొలిరోజు పోటీల్లో ఐదు స్వర్ణాలు, మూడు రజత పతకాలను సాధించారు. గుర్విందర్‌ సింగ్‌ (100 మీ.), విక్రాంత్‌ పంచల్‌ (400 మీ.), ఫ్లోరెన్స్‌ బార్లా (400 మీ.), రోహిత్‌ యాదవ్‌ (జావెలిన్‌ త్రో) స్వర్ణాలు దక్కించుకోగా, 4400 మీటర్ల రిలేలో భారత జట్టు పసిడి అందుకుంది. రజతాలు నెగ్గిన వారిలో అబ్ధుల్‌ రజాక్‌ (400 మీ.) ప్రిసిల్లా డేనియ్‌ (800 మీ.), సాహిల్‌ సిల్వాల్‌ (జావెలిన్‌ త్రో) ఉన్నారు.