జగన్ ను కలిసిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

SMTV Desk 2019-05-31 15:47:10  jagan, ap dgm,

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డిని ఈరోజు ఉదయం అమరావతిలో ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ కలిశారు. డీజీపీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన తర్వాత గౌతమ్‌ సవాంగ్‌ సీఎంతో భేటీ కావడం ఇదే తొలిసారిగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్రంలో శాంతి భధ్రతల అంశంతో పాటు ఐపీఎస్‌ అధికారుల బదిలీలపై డీజీపీతో సీఎం చర్చించినట్లు సమాచారం అందుతుంది.
అదేవిధంగా సీఎంగా జగన్‌ ప్రమాణం చేసిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే నలుగురు ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

సీఎంకు ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ఉన్న సతీశ్‌చంద్రతో పాటు జి.సాయిప్రసాద్‌, ఎం.గిరిజాశంకర్‌, ఏవీ రాజమౌళి బదిలీ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్‌ స్పష్టం చేశారు కూడా. వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రా వ్యవహారాలు చాలా చకా చకా జరుగుతున్నట్లు తెలుస్తోంది.