బీజింగ్, ఆగస్టు 28 : `సరిహద్దుల్లో శాంతి నెలకొంది. భారత్, చైనా దేశాల సైన్యాలు వెనుదిరిగాయి. అంటూ భారత విదేశాంగశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కొద్దిసేపటికే చైనా విదేశాంగ శాఖ మరో ప్రకటనతో ముందుకు వచ్చి `అలాంటిదేం లేదు` అని సంచలన వ్యాఖ్యలు చేసింది. డోక్లాం సరిహద్దు నుంచి కేవలం భారత సైన్యాలు మాత్రమే వెనక్కి వెళ్లాయని, చైనా బలగాలు అక్కడే మోహరించి ఉంటాయని చైనా విదేశాంగ ప్రతినిధి హు చున్యింగ్ వెల్లడించారు. సెప్టెంబర్లో చైనాలో జరగనున్న బ్రిక్స్ సమావేశాలకు ప్రధాని మోదీ హాజరు కావాల్సి ఉండటంతో ఇరు దేశాలు ఒక అంగీకారానికి వచ్చి డోక్లాం సరిహద్దు నుంచి సైనిక బలగాలను వెనక్కి పిలిపించాయని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది.