ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జగన్ కు విన్నపం

SMTV Desk 2019-05-31 14:00:41  jagan

ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ సమ్మెకు సిద్ధమవుతోంది. జూన్ 13 నుంచి సమ్మెను చేపడుతున్నట్టు జేఏసీ ప్రకటించింది. దూరప్రాంతాలకు వెళ్లే సర్వీసులను 12వ తేదీ నుంచే నిలిపివేస్తున్నట్టు తెలిపింది. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై స్పందించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేసింది. సిబ్బంది కుదింపుపై యాజమాన్యం వైఖరిని మార్చుకోవాలని కోరింది. అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని గతంలో జగన్ హామీ ఇచ్చారని... ఇచ్చిన హామీని నిలుపుకోవాలని విన్నవించింది.