నంద్యాల, ఆగస్ట్ 28: ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం, గెలిచిన తరువాత మర్చిపోవడం చంద్రబాబుకి అలవాటేనని, ఇది చంద్రబాబు విజయం కాదని, కేవలం రాజకీయ దిగజారుడుతనమే అంటూ వైసిపి అధినేత జగన్ విమర్శించారు. భయపెట్టి, అధికార దుర్వినియోగం చేసి, డబ్బు పంచి గెలిచిన విధానమే చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శనమంటూ ఆయన వ్యాఖ్యానించారు. తన కేబినెట్ మంత్రులందరినీ నంద్యాలలో ఉంచి బాబు అవినీతి రాజకీయాలు చేశారంటూ జగన్ మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో రూ.200 కోట్లు చంద్రబాబు ఖర్చుపెట్టారు అందుకే గెలిచారంటూ జగన్ మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక 2019 ఎన్నికలకు రెఫరెండం కాదని ఆయన తెలిపారు. సమయం వచ్చినప్పుడు తమ సత్తా చూపిస్తామని ఉద్ఘాటించారు. ప్రజలు భయపడే టీడీపీకి ఓట్లు వేశారని ఆయన విమర్శించారు.