ఆధార్ కార్డులను లాక్కుని త‌మ‌కు ఓటువేయ‌క‌పోతే ఫింఛ‌ను ఇవ్వబోమని టీడీపీ భయపెట్టింది: జగన్

SMTV Desk 2017-08-28 15:06:06  YSRCP, YS Jagan, Nandyala by-polls, By-polls Results

నంద్యాల, ఆగస్ట్ 28: వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ నంద్యాలలో ఓటమి చవి చూసిన నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... నంద్యాల ప్రజలను అధికార పార్టీ భయబ్రాంతులకు గురిచేసింది. అది చాలా బాధాకరమైన విషయమన్నారు. తమ పార్టీకి ఓట్లు వేయకపోతే ప్రజలకు ప్రభుత్వం నుండి చాలా కోల్పోతారంటూ సీఎం బెదిరించారని ఆయన ఆరోపించారు. అలాంటి పరిస్థితులలో కూడా చాలా మంది ఓట‌ర్లు త‌మ‌కు ఓట్లు వేశార‌ని, త‌మ‌కు ఓట్లు వేసిన వారికి చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నానని జగన్ అన్నారు. ఈ సందర్భంగా త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నేత‌లకు కూడా ధ‌న్య‌వాదాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు. ప్ర‌జ‌ల‌ ఆధార్ కార్డులను లాక్కుని త‌మ‌కు ఓటువేయ‌క‌పోతే ఫింఛ‌ను ఇవ్వబోమని టీడీపీ నేత‌లు బెదిరించార‌ని జగన్ విమర్శించారు.