గురువారం బంగారం ధర తగ్గుముఖం పట్టింది. పది గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,870కు క్షీణించింది. ఇక బంగారం ధర పడిపోతే వెండి ధర మాత్రం పెరిగింది. కేజీ వెండి ధర రూ.75 పెరుగుదలతో రూ.37,400కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం సానుకూల ప్రభావం చూపింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లోనూ పసిడి ధర తగ్గింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,870కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గుదలతో రూ.32,700కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది. కేజీ వెండి ధర రూ.75 పెరుగుదలతో రూ.37,400కు చేరితే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.80 తగ్గుదలతో రూ.36,095కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్ద స్థిరంగా ఉంది. ఇకపోతే హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,830కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,310కు తగ్గింది. కేజీ వెండి ధర రూ.39,200 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.