యువ క్రికెటర్ పై బీసీసీఐ వేటు

SMTV Desk 2019-05-30 19:27:46  rinku singh, bcci

భారత యువ క్రికెటర్ రింకు సింగ్ పై బిసిసిఐ నిషేధం వేటు వేసింది. బిసిసిఐ అనుమతి లేకుండా ఇటీవల అబు దాబిలో జరిగిన టీ20 టోర్నమెంట్‌లో ఆయన పాల్గొన్నారని బీసీసీఐ తీర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం దానికి పరిహారంగా మూడు నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉండాలని ఆదేశించింది. కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకు సింగ్ ఆ రాష్ట్రం నుంచి ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్‌లోనూ మెరిశాడు.