న్యూఢిల్లీ, ఆగస్ట్ 28 : నల్లధనాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పెద్ద నోట్లైన 1000, 500 వందల నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రజలు చిల్లర కోసం కష్టాలను అనుభవిస్తున్న తరుణంలో 500, 2000 నోట్లను విడుదల చేశారు. తాజాగా 200 నోట్లను కూడా విడుదల చేసి చిల్లర కొరత కొంత వరకు తగ్గించారు. ఈ నేపధ్యంలో త్వరలో మరింత హై సెక్యూరిటీతో వెయ్యి నోటును చలామణిలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ నోటుకు సంబంధించి డిజైన్ ముద్రించడానికి ఉపయోగించే పేపర్పై ఓ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించి ముద్రణను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిసింది.