పసిడి ఎగసింది...వెండి తగ్గింది

SMTV Desk 2019-05-30 18:54:06  Gold Rate, Silver rate, Bullion market

బుధవారం జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ మెరుగుపడటంతో పది గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.150 పెరుగుదలతో రూ.33,020కు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.225 తగ్గుదలతో రూ.37,325కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ పడిపోవడం ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ పసిడి ధర పెరిగింది. గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.43 శాతం పెరుగుదలతో 1,282.65 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.20 శాతం పెరుగుదలతో 14.34 డాలర్లకు ఎగసింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.33,020కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరుగుదలతో రూ.32,850కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,500 వద్ద స్థిరంగా కొనసాగింది.కేజీ వెండి ధర రూ.225 తగ్గుదలతో రూ.37,325కు పడిపోతే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.243 తగ్గుదలతో రూ.36,183కు క్షీణించింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,990కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,470కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.39,200కు క్షీణించింది.