ప్రసారభారతి సీఈవోగా ఎంపికైన వెంపటి

SMTV Desk 2017-06-03 15:29:08  selected in ceo, vempati shashishakar,hameedh ansari,digital media,

హైదరాబాద్, జూన్ 3 : ప్రసారభారతి చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్(సీఈవో) గా వెంపటి శశిశేఖర్ ను నియమిస్తూనట్లు ఉపరాష్ట్రపతి అన్సారీ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ శుక్రవారం తెలిపింది. సీఈవోగా ఐదేళ్ళ పాటు కొనసాగునున్న శేఖర్ ప్రస్తుతం ప్రసరభారతిలో పార్ట్ - టైం సభ్యునిగా ఉన్నారు. గతంలో ఇన్ఫోసిస్ సంస్థలో పనిచేసిన శేఖర్,ప్రస్తుతం ఓ ఆన్ లైన్ మీడియా సంస్థకు సారథ్యం వహిస్తున్నారు. ఆయన ఐఐటీ - ముంబైలో చదువుకున్నారు. కార్పొరేట్ మేనేజ్ మెంట్, టెక్నోలజీ కన్సల్టింగ్, డిజిటల్ మీడియాలో అనుభవం ఉంది. గతంలో ఆడిట్ కమిటీ చైర్మెన్ గా, ఫైనాన్స్, అకౌంట్ కమిటీ, టెక్నోలజి కమిటీ హెచ్ఆర్ కమిటీల్లో సభ్యునిగా ఉన్నారు. ఇన్ఫోసిస్ ల ప్రోడక్ట్ స్ట్రాటజిస్ట్ గా, అమెరికాలో డిజిటల్ ఇన్నోవేటర్ గా సేవలందించారు. ఈ రంగంలో రెండు పేటెంట్లు సాధించారు.