రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తాజాగా బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త తెలిపింది. ఫండ్ ట్రాన్స్ఫర్ (నగదు బదిలీ)కు సంబంధించిన టైమింగ్స్ను మరింత పొడిగించింది. ఆర్బీఐ ఆర్టీజీఎస్ ఫండ్ ట్రాన్స్ఫర్ సమయాన్ని గంటన్నర సేపు పొడిగించింది. సాయంత్రం 4:30 నుంచి 6:00 వరకు నగదు పంపొచ్చు. జూన్ 1 నుంచి కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. ఆర్టీజీఎస్ అంటే రియల్టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. అంటే రియల్ టైమ్లో తక్షణం డబ్బును ఇతరులకు పంపొచ్చు. పెద్ద మొత్తంలో డబ్బులు పంపడానికి ఈ మార్గాన్ని ఉపయోగిస్తారు. కనీసం రూ.2 లక్షలు పంపాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. రూ.2 లక్షల వరకు డబ్బుల్ని ఐఎంపీఎస్ విధానంలో పంపొచ్చు.