వైరల్ అవుతున్న జగన్ సాంగ్ ... విన్నావా దేవుడా.. సామాన్యుడి మాట

SMTV Desk 2019-05-30 13:38:32  Jagan,

వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధానంగా రావాలి జగన్... కావాలి జగన్ అనే పాట ప్రజల్లోకి అనూహ్యంగా చొచ్చుకుపోయింది. ఏకంగా కోటిమందికి పైగా ఈ పాటను యూట్యూబ్ లో విన్నారు. ఇది ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపి ప్రజలను వైసీపీ వైపు మళ్లించేందుకు దారితీసింది. ఇలా ఎన్నికల సమయంలో వైసీపీకి ఎన్నో పాటలు అత్యంత ప్రభావాన్ని చూపాయని చెప్పవచ్చు. అందులో భాగంగా మంగ్లీ పాడిన జగన్ అన్న వంటి సాంగ్స్ అమిత ప్రభావాన్ని చూపాయి.



అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో పాటలు వెలిశాయి. ముఖ్యంగా టీడీపీ పీడ వదిలింది అంటూ ఎన్నో పాటలు పుట్టుకొచ్చాయి. అందులో భాగంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పాట విన్నావా దేవుడా.. సామాన్యుడి మాట.. వినిపించిందా దేవుడా సామాన్యుడి పాట ఈ పాటను ప్లాన్.. బి రాజా.. కృష్ణకుమారి రచించి ట్యూన్ కట్టారు. ముఖ్యంగా ఈ పాట ఐదేళ్లుగా ప్రజలు పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లు తెలుపుతుంది. నిజంగా ఈపాట ప్రజల పడిన కష్టాల్లోంచి పుట్టినట్లుగా జనాలను ఎంతో ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా జగన్ ప్రమాణ్వీకారం సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఇదే పాటను వారి వారి వాహనాల్లో పెట్టుకొ నేంతగా ఈ పాట దూసుకుపోతుంది.