విజయవాడ దుర్గమ్మ గుడిలో గవర్నర్ దంపతులు

SMTV Desk 2019-05-30 13:37:53  Governor, family, vijay wada,

ఏపీలో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ అడుగుపెట్టారు.నిన్న సాయంత్రం విజయవాడకు చేరుకున్న గవర్నర్ దంపతులు బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు.

అయితే రాత్రి ఇంద్రకీలాద్రి చేరుకున్న గవర్నర్ దంపతులకు దేవస్థాన ఈవో కోటేశ్వరమ్మ, వేదపండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అర్చకులు శేష వస్త్రంతో సత్కరించి, వేద ఆశీర్వచనం అందించారు. ఈవో కోటేశ్వరమ్మ గవర్నర్ నరసింహన్ దంపతులకు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్ధప్రసాదాలను అందించారు.