తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈసీఎల్ నరసింహన్ ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదు కానుంది. ఆయన ఏకంగా ఐదుగురు ముఖ్యమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్గా నిలవనున్నారు. 2010, నవంబర్ 25న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అవతరించింది. అప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్తో నరసింహన్ ప్రమాణం చేయించారు.
అదే సంవత్సరం ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ ఘనవిజయం సాధించారు. రెండోసారి సీఎంగా కేసీఆర్తో నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. తాజాగా ఈ రోజు మధ్యాహ్నం 12.23 గంటలకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితోనూ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఐదుగురు ముఖ్యమంత్రులతో ప్రమాణస్వీకారం చేయించిన అరుదైన ఘనత నరసింహన్ ఖాతాలో నమోదు కానుంది.