మేము గెలవడానికి నాలుగు అంశాలున్నాయి: శిల్పా మోహన్ రెడ్డి

SMTV Desk 2017-08-27 19:49:36  Nandyala by-polls results, Silpa Mohan Reddy, YSRCP, Namdyala Counting

నంద్యాల, ఆగస్ట్ 27: నంద్యాల ఫలితాలు రేపు తేలనున్న నేపధ్యంలో వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి మీడియా మాట్లాడుతూ... మేము గెలవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలాంటి సందేహం లేదు ప్రజలు మా వెంటే ఉన్నారనడానికి అంటూ ధీమా వ్యక్తం చేశారాయన. మా గెలుపుకు కారణాలు నాలుగు అంశాలున్నాయంటూ... మొదటిది జగన్ సమ్మోహనా శక్తి, అదే విధంగా మా పార్టీకి ప్రజల్లో ఉన్న బలం, మా వ్యక్తిగత బలం, ప్రభుత్వ వ్యతిరేకత అని చెప్పుకువచ్చారు. ఈ నాలుగు అంశాలు చాలు మా విజయానికి, తెదేపా ఓటమికి అని శిల్పా తెలిపారు. ఎంత మెజార్టీ వస్తుందనే ప్రశ్నకు సమాధానంగా ఆ విషయాన్ని నేనెప్పుడూ ప్రస్తావించలేదు అని పేర్కొన్నారు.