హైదరాబాద్: హైదరాబాద్ లో మైండ్స్పేస్- ఎస్ఎల్ఏఎన్ కార్పొరేట్ క్రీడలు ప్రారంభమయ్యాయి. అయితే మాధాపూర్లోని మైడ్స్పేస్ ఆవరణలో జరిగే ఈ క్రీడల్లో 100 ఐటీ కంపెనీలకు చెందిన 5000 మంది ఔత్సాహికులు బరిలో దిగుతారు. మూడు నెలల పాటు బాక్స్ క్రికెట్, టేబుల్ టెన్నిస్, సాకర్, చెస్, క్యారమ్ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తారు.