వైసీపీ ప్రభుత్వంతో కలిపి మొత్తం ఐదు

SMTV Desk 2019-05-29 14:59:41  jagan

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ అరుదైన ఘనత సాధించారు. గవర్నర్ నరసింహన్ హయాంలో నాలుగు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఐదో ప్రభుత్వం ఏర్పడబోతోంది. 2009లో ఉమ్మడి రాష్ట్రానికి గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌.. 2010లో కిరణ్ కుమార్‌రెడ్డితో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. 2014లో ఏపీలో చంద్రబాబుతో, తెలంగాణలో కేసీఆర్‌తో సీఎంలుగా గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించారు. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు విజయం సాధించిన కేసీఆర్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఏపీకి సీఎంగా గురువారం జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణం చేయించబోతున్నారు. వైసీపీ ప్రభుత్వంతో కలిపి మొత్తం ఐదు ప్రభుత్వాలు గవర్నర్ నరసింహన్ హయాంలో ఏర్పడినట్టు చెప్పవచ్చు.