తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేటలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నగరంలోని మార్కెట్ యార్డును ఆనుకుని ఉన్న కొబ్బరిపీచు పరిశ్రమలో పీచు కుప్పలకు నిప్పంటుకుని దాదాపు కోటి రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. ఎగసి పడిన అగ్నిజ్వాలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శమ్రించి అదుపులోకి తెచ్చారు. మార్కెట్ యార్డు పక్కన ప్రమాదం జరగడంతో స్థానికంగా తీవ్రభయాందోళన నెలకొంది. అయితే మంటలు అదుపులోకి రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు.