ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమం

SMTV Desk 2019-05-29 12:03:25  mptc ,zptc elections,

రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్ట సవరణ చేస్తూ సోమవారం ఆర్డినెన్స్ జారీ చేయడంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమం అయ్యింది. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టి వెంటవెంటనే ఫలితాలు ప్రకటిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. చట్ట సవరణ చేయడం వలన గెలిచిన ఎంపీటీసీ, జెడ్పీటీసీలు ప్రమాణస్వీకారం చేయక మునుపే ప్రత్యేక సమావేశం నిర్వహించుకొని ఎంపీపీ, జెడ్పీ ఛైర్మన్, డెప్యూటీ చైర్మన్లను ఎన్నుకొనేందుకు కూడా వీలుకలిగింది కనుక ఫలితాలు వెలువడిన వెంటనే అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష పద్దతిలో ఎన్నికలు నిర్వహించబడతాయి.