యాడ్స్‌తోనే రూ. 100 కోట్లు సంపాదిస్తున్న బాలీవుడ్ స్టార్ హీరో

SMTV Desk 2019-05-29 11:46:34  AKshay Kumar, ads 100 crores

యాడ్ ఫిలింస్, కమర్షియల్స్‌ చేస్తూ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న వారిలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నgబర్ స్థానంలో ఉన్నారు. ఇప్పుడాయన చేతిలో రూ. 100 కోట్ల విలువ చేసే కమర్షియల్స్ ఒప్పందాలున్నాయి. అక్షయ్ తర్వాత రెండో రణ్‌వీర్ సింగ్ రూ.84 కోట్లు రెండో స్థానంలో ఉండగా.. ఆయన స్థానంలో ఆయన సతీమణి దీపికా పదుకొణె రూ.75 కోట్లు తీసుకుంటూ మూడో స్థానంలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో అమితాబ్ బచ్చన్‌ (రూ.72 కోట్లు), ఆలియా భట్‌ (రూ.68 కోట్లు), షారుఖ్‌ ఖాన్‌ (రూ.56 కోట్లు), వరుణ్‌ ధావన్‌ (రూ.48 కోట్లు), సల్మాన్‌ ఖాన్‌ (రూ. 40 కోట్లు), కరీనా కపూర్‌ (రూ.32 కోట్లు), కత్రినా కైఫ్‌ (రూ.30 కోట్లు) ఉన్నారు.