రేవంత్ వెంట్రుకవాసిలో గెలిచాడు

SMTV Desk 2019-05-29 11:45:24  KTR, Loksabha,

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో మా సీట్లు పోయినా... ఓట్ల శాతం మాత్రం మాకు బాగా పెరిగిందని వెల్లడించారు. 2014 లోకసభ ఎన్నికల్లో 34 శాతం ఓట్లు వచ్చాయని.. ఈసారి 6 శాతం ఓట్లు పెరిగాయని ఆయన తెలిపారు. అదేవిధంగా 16 ఎంపీ సీట్ల కోసం గట్టిగా ప్రయత్నం చేశాం... ఆశించిన ఫలితాలు రాలేదని అన్నారు. ఇక మల్కాజిగిరిలో వెంట్రుకవాసితో కాంగ్రెస్ గెలిచిందని.. అందులో ఘనం ఏమీలేదని కేటీఆర్ వివరించారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ హవాతో భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయని వివరించారు. ఇంకా 17 సీట్లలో 10 మేం గెలిచామన్న ఆయన... ఆదిలాబాద్ లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ కూడా ఊహించలేదని స్పష్టం చేశారు.

అలాగే... ఈసారి ఎన్నికల్లో విచిత్రమైన ట్రెండ్ కనిపించిందని.. వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం వల్ల మా పార్టీపై ఏమైనా ప్రభావం ఉందేమో చూస్తామని వెల్లడించారు. లోకసభ ఎన్నికల ఫలితాలు మాకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్‌గా భావిస్తామని తెలిపిన ఆయన బీజేపీ వాళ్లు ఈ ఎన్నికల్లో అనూహ్యమైన ఫలితాలను కైవసం చేసుకున్నారని వివరించారు. మేం లోకసభ ఎన్నికల్లో బాగా కష్టపడ్డామని... ఈ ఫలితాలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేసీఆర్ వివరించారు.