వార్మప్ మ్యాచ్ లలో సందర్భంగా టీంఇండియా నేడు బంగ్లాదేశ్ జట్టుతో రెండో వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నది. అయితే.. టాస్ తర్వాత మొదలైన వర్షం.. అరగంట మ్యాచ్ సమయాన్ని వృథా చేసింది. అనంతరం వర్షం తగ్గుముఖం పట్టడంతో అంపైర్లు మ్యాచ్ని ప్రారంభించగా.. రెండు బంతులు పడగానే మళ్లీ వర్షం మొదలైంది. దీంతో.. మ్యాచ్ని అంపైర్లు తాత్కాలికంగా నిలిపివేసి కాసేపయ్యాక మళ్ళీ మొదలుపెట్టారు. మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానుండగా.. భారత్ జట్టు ఇప్పటికే న్యూజిలాండ్తో ఒక వార్మప్ మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్లో పేలవంగా విఫలమైన టీమిండియా.. 6 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. గాయం కారణంగా కివీస్తో మ్యాచ్ని విజయ్ శంకర్ ఆడలేదు. దీంతో.. ఈరోజు అతడ్ని ఆడించాలని భారత్ కెప్టెన్ కోహ్లీ ఆశించగా.. వరుణుడు అడ్డుపడుతున్నాడు. కేదార్ జాదవ్ మాత్రం ఇంకా గాయం నుంచి కోలుకోలేదని కెప్టెన్ కోహ్లీ వెల్లడించాడు.