రాష్ట్రంలో పెన్షన్ లబ్దిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్లను వచ్చే నెల నుంచే అందించాలని నిర్ణయించింది. జూన్ నెల 2019 నుంచి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర లబ్దిదారులకు పెంచిన కొత్త పెన్షన్లను అమలు చేయబోతున్నామంటూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర అవతరణ కానుకగా అందివ్వబోతోంది.
రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటై ఐదు నెలలు గడుస్తున్నా కొత్త పెన్షన్లు అమలు కావడం లేదంటూ లబ్దిదారుల్లో కొంత నిరుత్సాహం ఉండేది. వెలుగు దినపత్రిక ఇవాళ ఈ విషయంలో ప్రత్యేక కథనం ప్రచురించింది. ఇవాళే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రకటన రావడం విశేషం.
కొత్త పెన్షన్లు ఇలా ఉన్నాయి
కేటగిరీ పాత పెన్షన్ కొత్త పెన్షన్
వృద్ధులు రూ.1000 రూ.2016
వితంతువులు రూ.1000 రూ.2016
వికలాంగులు రూ.1500 రూ.3016
చేనేత కార్మికులు రూ.1000 రూ.2016
కల్లుగీత కార్మికులు రూ.1000 రూ.2016
HIV AIDS బాధితులు రూ.1000 రూ.2016
బీడీ కార్మికులు రూ.1000 రూ.2016
ఒంటరి మహిళలు రూ.1000 రూ.2016
ఫైలేరియా బాధితులు రూ.1000 రూ.2016