కల్తీ మద్యం తాగి 12 మంది మృతి

SMTV Desk 2019-05-28 17:04:26  kalthi wine,

ఉత్తర ప్రదేశ్ లో మంగళవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆస్పత్రిలో 20 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని బాధితులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యుపిలో ఫిబ్రవరి9న కల్తీ మద్యం తాగి 60 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. రోజు రోజుకు కల్తీ మద్యం ఏరులై పారుతున్న ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ప్రజలు మండిపడుతున్నారు. అధికార పార్టీ అండదండలతోనే కల్తీ మద్యం జోరుగా సాగుతుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని కల్తీ మద్యం అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఉత్తరాఖండ్ లో ఫిబ్రవరి 10 న కల్తీ మద్యం తాగి 30 మంది చెందిన విషయం విధితమే. యుపి, ఉత్తరాఖండ్ లో 2019లో కల్తీ మద్యం తాగి 200 మంది వరకు చనిపోయా ఉంటారని అంచనా.