హైదరాబాద్, ఆగస్ట్ 27 : చారిత్రాత్మక నేపధ్యం ఉన్న "రుద్రమదేవి" లాంటి చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు గుణశేఖర్, ఈసారి భక్త్ర ప్రహ్లాదుడు-హిరణ్యకశిపుడికి సంబంధించిన కథాంశంతో ఒక పౌరాణిక చిత్రానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రంలో హిరణ్యకశిపుడిగా మొదట వెంకటేశ్ నటించే అవకాశాలున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడా పాత్రలో ప్రముఖ హీరో దగ్గుబాటి రానా నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ హిరణ్యకశిపుడి పాత్రకు రానా అయితేనే సరిగా సరిపోతాడని దర్శకుడు గుణశేఖర్ భావిస్తున్నారట. ఇప్పటికే రానాను సంప్రదించగా ఎలాంటి ఆలోచన లేకుండా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిలింనగర్ టాక్. ఇప్పటికే గుణశేఖర్ "బాలల రామాయణం" లాంటి పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించి సత్తా చాటుకున్నారు.