బళ్లారి నగరంలో పోలీసులు యమా స్ట్రిక్ట్..ట్రిపుల్ రైడింగ్, డ్రైవింగ్ చేస్తూ మొబైల్లో మాట్లాడడం లాంటి నిబంధనలు అతిక్రమిస్తే రక్షక భటులు ముక్కు పిండి మరీ జురిమానా వసూలు చేస్తారు. అయితే ఇవన్నీ సామాన్యులకేనండోయ్.. మాకు మాత్రం కాదు అంటున్నారు పోలీసులు. సోమవారం నగరంలోని ప్రధాన రహదారిలో ముగ్గురు పోలీసులు దర్జాగా ఒకే బైక్పై కలిసి.. ట్రిపుల్ రైడింగ్లో వెళ్తుంటే నగర ప్రజలు ఔరా.! అని ముక్కుపై వేలు వేసుకున్నారు. మమ్మల్నయితే మహా ఇబ్బంది పెట్టేస్తారు. మీరు మాత్రం యథేచ్చగా రూల్స్ అతిక్రమిస్తారా..అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.