కాకినాడ ఆగస్ట్ 27: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేడు రెండవ రోజు కాకినాడలో పర్యటించారు. ముఖ్యమంత్రికి ప్రజలు నగరంలోని తమ సమస్యలను సకాలంలో పరిష్కరించాలని చెత్తను తరలించకపోవడంతో భారీగా రోడ్లపైన చెత్తచెదారం పేరుకుపోయి రోగాల భారిన పడుతున్నామని, దీనితో వర్షాకాలం డ్రైనేజిలు పొంగి పోర్లడంతో ఇళ్ళలోకి నీరు వస్తుందని, పందులు, కుక్కల బెడద చాలా తీవ్రంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ....కాకినాడలో పందులు, కుక్కల బెడదను శాశ్వతంగా పరిష్కరిస్తామని, ప్రజా సమస్యలను తీరుస్తామని, అదేవిదంగా పందులను, కుక్కలను నగరానికి దూరంగా వదిలేస్తామని దానికి గాను 5 ఎకరాల స్థలాన్ని కేటాయించామని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారు.