జమ్ముకశ్మీర్, ఆగస్ట్ 27 : జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి కాల్పులకు తెగబడింది. పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ నేపధ్యంలో ఈ దాడి చేసింది తామేనంటూ పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మొహమ్మద్ ప్రకటించింది. ఈ ఎదురుకాల్పుల్లో జరిగిన దాడిలో మొత్తం 8 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు. పుల్వామా జిల్లా పోలీస్ కాంప్లెక్స్ పై ఉగ్రవాదులు దాడి చేయడమే కాకుండా, అక్కడ నివసించే కుటుంబాలను బందీలుగా చేసుకున్నారు. దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదులపైకి కాల్పులు జరిపి బందీలుగా కుటుంబాలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఈ దాడిలో ముగ్గురు పాక్ రేంజర్లను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.