ఓడిపోయినంత మాత్రన్న క్రుంగిపోను

SMTV Desk 2019-05-27 18:07:16  kavitha,

నిజామాబాద్‌ తెరాస లోక్‌సభ అభ్యర్ధిగా పోటీచేసి ఓడిపోయిన తెరాస నేత కవిత తొలిసారిగా తన ఓటమిపై స్పందించారు. మోపాల్ మండలం మంచిప్పలో మీడియాతో మాట్లాడుతూ, “రాజకీయాలలో గెలుపోటములు తప్పవు. కనుక ఓడిపోయినంత మాత్రన్న క్రుంగిపోను. యధాప్రకారం నిజామాబాద్‌ జిల్లా ప్రజలకు సేవలందిస్తూనే ఉంటాను. కార్యకర్తలు కూడా అధైర్యపడవలసిన అవసరం లేదు,” అని అన్నారు.

బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ చేతిలో కవిత 68,000 ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. సిఎం కేసీఆర్‌ కుమార్తె అయిన ఆమె ఓడిపోవడం, అదికూడా అంత భారీ ఓట్ల తేడాతో ఓడిపోవడం తెరాసలో అందరికీ పెద్ద షాకేనని చెప్పవచ్చు. ఆమె ఓటమికి కారణాలు అందరికీ తెలుసు కనుక మళ్ళీ వాటి గురించి చెప్పుకోనవసరం లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తెరాసయే అధికారంలో ఉంది కనుక ఆమె ఓడిపోయినప్పటికీ మళ్ళీ పైకి ఎదగడం పెద్ద కష్టం కాదు.