ప్రపంచకప్ లో ఇంగ్లాండ్ 500 రన్స్ మార్క్‌ని దాటుతుంది!

SMTV Desk 2019-05-27 16:05:31  england cricket team, icc world cup 2019

ఇంగ్లాండ్ వేదికగా త్వరలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ టోర్నీల్లో ఇంగ్లాండ్ జట్టు 500 రన్స్ మార్క్‌ని అందుకుంటుందని ఆ జట్టు ఓపెనర్ జేసన్ రాయ్ ధీమా వ్యక్తం చేశాడు. 2016లో పాకిస్థాన్‌‌తో జరిగిన వన్డేలో 444/3తో రికార్డు నెలకొల్పిన ఇంగ్లాండ్ టీమ్.. గత ఏడాది ఆస్ట్రేలియాపై 481/6తో ఆ రికార్డుని మళ్లీ బద్దలుకొట్టింది. ఇటీవల భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇంగ్లాండ్ టీమ్‌కి వన్డేల్లో 500 పరుగులు చేయగల సామర్థ్యం ఉందంటూ కితాబిచ్చాడు. సొంతగడ్డపై వరల్డ్‌కప్ జరుగుతుండటం ఆ జట్టుకి అదనపు బలంగా కనిపిస్తోంది. కానీ.. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ప్రపంచకప్‌ని ఇంగ్లాండ్ గెలవలేదు. ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ టీమ్ 500 పరుగుల రికార్డ్‌ని అందుకోగలదా..? అని జేసన్ రాయ్‌ని ప్రశ్నించగా.. ‘అవును.. మా టీమ్‌కి ఆ సత్తా ఉంది. గత ఏడాది ఆస్ట్రేలియాపై మ్యాచ్‌లో దాదాపు ఆ రికార్డుకి చేరువయ్యాం. మరో రెండు ఓవర్లు బ్యాటింగ్ చేసే అవకాశం ఉండింటే.. 500 మార్క్‌ని అందుకునేవాళ్లం’ అని జేసన్ రాయ్ వెల్లడించాడు.