పారితోషికాన్ని పెంచేసిన పాయల్

SMTV Desk 2019-05-27 15:50:46  payal rajput

తెలుగులో ఈ మధ్య కాలంలో అందాల కథానాయికలలో ఒకరిగా పాయల్ రాజ్ పుత్ కనిపిస్తుంది. ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఈ సుందరి గ్లామర్ పరంగా యూత్ హృదయాలను కొల్లగొట్టేసింది. ఒక వైపున తన మాతృభాష అయిన పంజాబీలోను .. తమిళ సినిమాల్లోను ఆమె బిజీ అయింది.

ఇక తెలుగులో వెంకీమామ .. డిస్కోరాజా .. మన్మథుడు 2 సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ - కేఎస్ రవికుమార్ సినిమా కోసం ఆమెను సంప్రదించగా, పారితోషికంగా ఆమె 75 లక్షలు అడిగిందని అంటున్నారు. దాంతో ఆ స్థాయి పారితోషికం ఆమెకి ఇవ్వాలా .. మరో కథానాయికను సంప్రదించాలా అనే విషయంలో దర్శక నిర్మాతలు తర్జన భర్జనలు పడుతున్నారని వినికిడి. పాయల్ కి యూత్ లోను .. మాస్ ఆడియన్స్ లోను ఒక రేంజ్ లో క్రేజ్ ఉండటం వలన, ఆమెను ఎంపిక చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్ ఎక్స్ 100 సినిమాకి గాను పాయల్ రాజ్ పుత్ కి 5 లక్షలు పారితోషికంగా ఇచ్చారు. గ్లామర్ పరంగా ఎక్కువ అందాలని ఆరబోసిన....తక్కువ పారితోషికం తీసుకుందంటే అది తన మొదటి సినిమా కావడం విశేషం.