జీతం అడిగిన డాక్టర్...... బంధించిన దంపతులు

SMTV Desk 2019-05-27 12:57:56  doctor

హైదరాబాద్ కు చెందిన నరేంద్ర విక్రమాదిత్య యాదవ్, దివ్య ఎన్నారై దంపతులు. వీరికి ఆసుపత్రుల నిర్వహణ వ్యాపారం ఉంది. కొన్నాళ్లు లండన్ లో బ్రూన్వాల్డ్ ఆసుపత్రిని నిర్వహించారు. భారత్ లో కూడా హాస్పిటల్స్ స్థాపించాలని హైదరాబాద్ వచ్చి, కుషాయిగూడలో ఉన్న పౌలోమి ఆసుపత్రిని లీజుకు తీసుకుని, నూతన హంగులతో పునఃప్రారంభించారు.

పాత స్టాఫ్ స్థానంలో కొత్తవారిని తీసుకున్న ఈ దంపతులు యూకే నుంచి క్రిటికల్ కేర్ నిపుణుడైన డాక్టర్ కెన్నెత్ ట్రాన్సెండ్ ను కూడా భారీ మొత్తం ఆశచూపి రప్పించారు. అయితే, రెండు నెలల పాటు సక్రమంగా జీతాలు చెల్లించిన నరేంద్ర, దివ్య ఆపై అప్పులపాలయ్యారు. స్టాఫ్ కు జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితుల్లో తప్పించుకు తిరగడం మొదలుపెట్టారు. దీనిపై యూకే డాక్టర్ కెన్నెత్ ఆ దంపతులిద్దరినీ నిలదీయడంతో తమ బండారం బయటపడుతుందని భయపడి ఆయనను ఓ ఇంట్లో నిర్బంధించారు.

ఆయన ఎలాగోలా 100 నంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు కాపాడారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు చెన్నైలో నరేంద్ర విక్రమాదిత్యను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దివ్య, వారికి సహకరించిన డ్రైవర్ చంద్రభాను ప్రస్తుతం పరారీలో ఉన్నారు.