2019 ఎన్నికల ఫలితాల్లో వై. ఎస్. జగన్ విజయాన్ని సాధించారు. ఈ ఫలితాలపై పూరి జగన్నాథ్ స్పందించారు. తన తమ్ముడు ఉశంకర్ గణేశ్ నర్సీపట్నం నియోజక వర్గం నుండి ఎమ్మెల్యేగా వైకాపా పార్టీ గెలిచాడని, కాబట్టి జగన్మోహన్కు తానెప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పేర్కొన్నారు.
"వైజాగ్లో మా కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నాను. వాడు గెలవడం కష్టమేనని అనుకున్నాం. కానీ వార్ వన్ సైడ్ అయిపోయేసరికి మతిపోయింది. ప్రజలందరూ రహస్య ఓటింగ్ పెట్టుకుని ఓటింగ్ వేద్దామని అనుకున్నారేమో తెలియడం లేదు. ఇన్ని కోట్ల మంది ఒక వ్యక్తిని నమ్మడం వాళ్ల నాయకుడు కావాలని కోరుకోవడం మామూలు విషయం కాదు. జగన్కు హాట్యాఫ్. ఎందుకంటే తండ్రి చనిపోయిన తర్వాత ఒంటిరివాడిగా ఎన్నో అవమానాలను, కష్టాలను తట్టుకుని అఖండ విజయాన్ని సాధించారు.
ఆయనలో విజయ గర్వం లేదు. పొగరు లేదు.. మౌనంగా ఉన్నారు. సేద తీరుతున్నారు. జగన్ యోధుడు. దైవ నిర్ణయం ప్రకారం, ప్రజానిర్ణయం వల్ల దక్కిందని జగన్ అన్నారు. నా సోదరుడికి జగన్ అంటే ప్రాణం. ఆయన ఫోటో చూసినా, వీడియో చూసినా ఎగ్జయిట్ అవుతాడు. తను ఎందుకు అలా ఫీల్ అవుతాడో నాకు ఈవాళ అర్థమైంది. గత ఎన్నికల్లో నా తమ్ముడు ఓడిపోయినా, మళ్లీ భుజం తట్టి, యుద్ధంలో ఇంతటి విజయాన్ని అందించిన జగన్కు నేను, నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటాం. నేను రాజకీయాల్లో లేను. కానీ యోధులంటే ఇష్టం. నాకు జగన్ సింహంలా కనపడుతున్నారు" అన్నారు పూరి జగన్నాథ్ తెలిపారు.