ఢిల్లీలో వైసిపి చీఫ్ జగన్ పర్యటిస్తున్నారు. ఆదివారం ఉదయం జగన్ ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. అనంతరం బిజెపి సుప్రీం అమిత్ షాతో భేటీ అయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అఖండ విజయం సాధించినందుకు జగన్ అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు. మే 30న సిఎంగా తాను బాధ్యతలు తీసుకోనున్నానని, తన ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని అమిత్షాను జగన్ ఆహ్వానించారు.30 నిమిషాలపాటు జగన్, అమిత్ షా భేటీ కొనసాగింది. ఎపిలో అఖండ విజయం సాధించిన జగన్ కు అమిత్ షా అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జగన్ ఢిల్లీలోని ఎపి భవన్ కు వచ్చి అధికారులతో భేటీ అయ్యారు. ఎపి భవన్ కు వచ్చిన జగన్ కు వైసిపి అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.