ముంబై, ఆగస్ట్ 26: టెలికాం రంగంలో వరుస సంచలనాలతో వినియోగదారులకు చేరువవుతూ, పోటీదారులకు మరింత పోటీనిస్తూ దూసుకుపోతున్న రిలయన్స్ జియో సంస్థ 4జీ ఫీచర్ ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలో ఈ నెల 24న సాయంత్రం 5.30 నుండి 4జీ ఫోన్స్ ఆన్లైన్ బుకింగ్స్ ప్రారంభించింది. దీంతో వినియోగదారుల నుండి భారీ స్పందన వచ్చింది. ఒకానొక దశలో వెబ్సైట్ క్రాష్ కాగా, కొద్ది సమయం తరువాత మళ్లీ బుకింగ్స్ కొనసాగించారు. ఈ ఫోన్కు 30 లక్షల బుకింగ్స్ రావడం విశేషం. ఈ భారీ స్పందన నేపధ్యంలో సంస్థ ఫోన్ ప్రీ-బుకింగ్స్ను నిలిపివేస్తున్నామని ప్రకటించింది. ఇప్పటికే లక్షల మంది బుక్ చేసుకున్నారు, వారందరికి వచ్చేనెల నుంచి ఫోన్స్ డెలివరీ చేస్తాం అని పేర్కొన్నారు.