హీరాబెన్ ఆశీర్వాదం తీసుకోనున్న మోడీ

SMTV Desk 2019-05-26 16:52:50  Modi,

సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ గంగామాత, తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకోనున్నారు. రేపు సాయంత్రం గుజరాత్ వెళ్లి తల్లి ఆశీర్వాదం తీసుకుంటారు. అలాగే.. సోమవారం ఉదయం కాశీ వెళ్లి గంగామాత ఆశీర్వాదం కూడా తీసుకుంటారు మోడీ. తనపై నమ్మకం ఉంచిన కాశీ ప్రజలకు కృతజ్ఞతలు చెప్పనున్నారు మోడీ.

కాగా ఇందుకు సంబంధించి మోడీ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. వారాణాసి నుంచి పోటీ చేసిన మోడీ 4.8లక్షల భారీ మెజార్టీతో గెలిచిన విషయం తెలిసిందే.