వార్మప్ మ్యాచ్‌: కివీస్ టార్గెట్ 180

SMTV Desk 2019-05-25 22:20:18  india vs newzeland warmup match

ఇండియా-న్యూజిలాండ్‌ మధ్య జరుగుతున్న వార్మప్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు తడబడుతోంది. ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ దెబ్బకి వరుస ఓవర్లలో వికెట్లు చేజార్చుకున్న టీమిండియా.. 39.2 ఓవర్లకు 179/9 పరుగులు చేసి ఆలౌటయ్యింది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు రోహిత్ శర్మ (2: 6 బంతుల్లో), శిఖర్ ధావన్ (2: 7 బంతుల్లో) బంతిని మిడిల్ చేస్తూ టచ్‌లో ఉన్నట్లే కనిపించారు. కానీ.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ వేసిన ట్రెంట్ బౌల్ట్ తొలుత వికెట్ల ముందు రోహిత్ శర్మని దొరకబుచ్చుకోగా.. ఆ తర్వాత దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించిన శిఖర్ ధావన్ కూడా నాలుగో ఓవర్‌లో బౌల్ట్ బౌలింగ్‌లోనే కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లి (18: 24 బంతుల్లో 3x4) నిలకడగా ఆడినట్లు కనిపించినా.. తెలివైన బంతితో జట్టు స్కోరు 39 వద్ద అతడ్నీ గ్రాండ్‌హోమ్ బౌల్డ్ చేసేశాడు. అంతకముందే.. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన కేఎల్ రాహుల్ (6: 10 బంతుల్లో 1x4) కూడా బౌల్ట్ బౌలింగ్‌లో బంతిని వికెట్లపైకి ఆడుకుని ఔటయ్యాడు.