5వ అంతస్థు నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

SMTV Desk 2019-05-25 17:53:22  ap

ఓ వ్యక్తి ఐదవ అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్‌లో జరిగింది. విజయవాడకు చెందిన ఎం. విశ్వనాథం కుమారుడు శివ(35) హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్‌లో నివాసముంటున్నాడు. నేడు శివ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 8లోని అపార్ట్‌మెంట్ ఐదవ ఫ్లోర్‌కి వెళ్లి అక్కడ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.