కార్పొరేషన్ ఎన్నికల తర్వాత నంద్యాల ఫలితాలు వెల్లడించండి: ర‌ఘువీరా రెడ్డి

SMTV Desk 2017-08-26 13:24:26  AP PCC chief, Raghu Veera Reddy, Kakinada Corporation Elections, Nandyala by-polls results

కాకినాడ, ఆగస్ట్ 26: ఈ నెల 28న నంద్యాల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. కాగా, ఆ మరుసటి రోజు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ నేపధ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు ర‌ఘువీరా రెడ్డి మాట్లాడుతూ... కార్పోరేషన్ ఎన్నికలు పూర్తియిన తర్వాతే నంద్యాల ఫలితాలను ప్రకటించాలి. ఈ ఎన్నికలపై నంద్యాల ఫలితాలు భారీగా ప్రభావం చూపుతాయని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే కాకినాడలో ప్రచారం భారీగా సాగుతుంది. అధికార, ప్రతిపక్షాలు ప్రధానంగా ఒక సామాజిక వర్గం వైపే దృష్టిసారించినట్లు సమాచారం. లగడపాటి నంద్యాల సర్వేను టీడీపీ నేతలు ఇక్కడ ప్రచారాస్త్రంగా మలచుకున్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి.