హైదరాబాద్, ఆగస్ట్ 26 : విమానం గాల్లో ఉండగానే ఆ విమాన పైలట్ కు గుండెపోటు రావడంతో ప్రయాణికులంతా భయపడిపోయారు. వారంతా తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వచ్చింది. ఈ సంఘటన దోహా నుంచి రోమ్ వెళ్తున్న ఖతర్ ఎయిర్ లైన్స్ విమానంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే.. విధులలో ఉన్న ఓ పైలట్ కు ఒక్కసారిగా గుండెపోటు సంభవించడంతో ప్రయాణికులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆ దేవుణ్ణి ప్రార్థించారు. ఈ విమాన అత్యవసర ల్యాండింగ్ కోసం శంషాబాద్ ఎయిర్పోర్టు అధికారులకు సమాచారం అందించగా వారు అనుమతి ఇవ్వడంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసారు. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 225 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ పైలట్ ను జూబ్లీహిల్స్లోని ఓ ఆసుపత్రికి వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు.